Published On Sep 17, 2024
#malladipadmaja #telugukathaluaudio #telugustories శ్రీ మల్లాది పద్మజ గారు రాసిన " థాంక్స్ టు పారిస్ " కథ కు ఆడియో రూపం ఈ వీడియో.గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామం పద్మజ గారి జన్మస్థలం.బాల్యం నుండి బాగా చదివే అలవాటు ఉంది.దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కవిత్వాన్ని, రమేష్ నాయుడు గారి సంగీతాన్ని ఇష్టపడతారు. పద్మజ గారు, ఆంధ్రుల ఆహ్లాద రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి జీవిత భాగస్వామి, సహచరిణి. వారి రచనలతో పాటు... మాలతీ చందూర్, యద్దనపూడి సులోచనారాణి, వీరేంద్రనాథ్ గార్ల రచనలను ఇష్టపడతారు.శ్రీ "కిరణ్ ప్రభ" గారి శ్రీమతి "కాంతి కిరణ్" గారి ప్రోత్సాహం తో 2013 వ సంవత్సరం నుండి "కౌముది" వెబ్ మ్యాగజైన్ లో "సంసారం లో సరిగమలు" అనే శీర్షికన నెలకొక కథను రాస్తున్నారు. స్త్రీల దృష్టి కోణం నుండి ఈ సమాజం ఎలా ఉంది? అనేది ముఖ్యాంశం. ఇప్పుడా శీర్షిక చాలా పాపులర్. విపుల లో "స్వాధీన పతిక " అనే కథ ప్రచురితమైనది.ప్రస్తుత కథ " థాంక్స్ టు పారిస్" కౌముది లో ప్రకటితం. ఆ కథకు ఆడియో రూపం. గళం కూడా స్వయం గా శ్రీ పద్మజ గారిదే.విని మీ అభిప్రాయం కామెంట్ల సెక్షన్ లో తెలియచేయండి.ధన్యవాదాలు