యాంకర్ చోటు ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం 93వ జయంతి వేడుకలో ఘన నివాళి
KTV RK News KTV RK News
82.2K subscribers
19 views
2

 Published On Oct 15, 2024

యాంకర్ చోటు ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం 93వ జయంతి వేడుకలో ఘన నివాళి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోవాలి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆన్నారు


మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం యాంకర్ చోటు ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ 93వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏపీ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టి.కే విశ్వేశ్వర రెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి ,సీసీసీ ఛానల్ ఎండి పంతం కొండలరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దేశంలో అనేక సంస్కరణ తీసుకువచ్చారని అన్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆయన ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారని వివరించారు. యాంకర్ చోటు ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా రాజమహేంద్రవరంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన జయంతి, వర్ధంతి లను ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం, రతన్ టాటాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాంకర్ చోటు, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు బోడా వెంకట్, ఆదిత్య విద్యాసంస్థల ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

show more

Share/Embed