Published On Streamed live on Feb 5, 2024
మధుర భారతి, 'ఆచార్య' మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి
శృంగేరీ శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు కీ.శే. శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావుగారి పుత్రులు.
జిల్లెళ్ళమూడిలో "అమ్మ" నెలకొల్పిన 'మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు.
దేశ విదేశాలలో సాహిత్య ప్రసంగాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటారు.
అష్టావధాన, శతావధాన, సహస్రావధానాలకు సంచాలకులు.
భువనవిజయం, సరస్వతీ సామ్రాజ్యం, ఇంద్రసభ వంటి సాహిత్య రూపకాలలో పాత్రధారిగా, సూత్రధారిగా వ్యవహరిస్తారు.
"ఈనాడు" మకరందంలో ప్రతి గురువారం 'మకరందం' లో ఆధ్యాత్మిక విశేషాలు రచన.
తండ్రిగారి పేరిట విజయవాడలో "మధుర భారతి" అనే సంస్థకు వ్యవస్థాపకకార్యదర్శిగా సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
"ఉపన్యాస కళానిధి" , "సాహితీ బృహస్పతి", "ప్రవచన రత్నాకర" మొదలైన బిరుదులు, స్వర్ణకంకణ, కనకాభిషేకాది సత్కారాలు పొందారు.
ఉజ్జయినిలో "సంస్కృతి సమ్మేళన్" వారిచే "ఆచార్య" విశిష్ట పురస్కారం అందుకున్నారు.
Apologize for yesterday’s live telecast as I was away. Stay tuned to today’s livestream