Published On Dec 27, 2023
చార్ ధామ్ యాత్ర లో భాగం గా Day-5 లో మానా నుండి early morning బయల్దేరి గంగోత్రి ఆలయాన్ని దర్శించుకోవడానికి బయల్దేరాము. దారిలో కొండల మీద అన్నీ ఆపిల్ తోటలతో దారి మొత్తం ఎంతో అందం గా ఉంది అలాగే గంగోత్రి వెళ్ళే దారి కూడా చాలా జాగ్రత్త తో కూడిన ఘాట్ . చాలా సేపు ప్రయాణం చేసి గంగోత్రి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది . ఇక్కడ మన ఆంధ్రా వంటలు కలిగిన హోటల్ లు ఉన్నాయి. ఎంతో మంది మన తెలుగు రాష్ట్రాల నుండి రావడం వల్ల ఇక్కడ భోజనం కూడా దొరుకుతుంది . ఈ ఆలయాన్ని చేరుకోవడానికి యమునోత్రి లో ఉన్నట్టు నడక దారి ఏమి ఉండదు. రోడ్డు ద్వారా నే ఆలయం దగ్గరకు వెళ్ళవచ్చు . ఇది గంగా నది పుట్టిన ప్రదేశం కాబట్టి ఇక్కడ నుండి గంగ నీటిని తీస్కొని వెళతారు . ఇక్కడ నుండి ఇంకొక 20 కిలో మీటర్లు మంచు కొండల మీద మంచు కరిగి గంగా నది రూపం లో తయారవుతుంది . దూరం గా మంచు కొండలతో కింద ప్రవహిస్తున్న గంగా నదిని చూడటానికి చాలా అద్భుతం గా అనిపిస్తుంది. దర్శనం అయ్యాక హోటల్ కి వెళ్ళే మద్య లోఆపిల్ తోటలు చూసి వెళ్ళాం .