Published On Jul 31, 2023
మణిపూర్ లో హింసకాండను నిరసిస్తూ నేడు హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ నుండి హనుమకొండ కలెక్టర్ రేట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన కు దేశం లో ఉన్న ప్రజలందరూ ఖండిస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును దేశంలో ఉన్న క్రైస్తవులు అందరం ఖండిస్తున్నామన్నారు అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. మహిళపై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలన్నారు.
show more