Published On Sep 15, 2024
మనం జరుపుకొనే పండగల్లో వినాయక చతుర్థి లేదా వినాయక చవితికి అత్యంత ప్రాధాన్యత. . పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్కంఠతో జరుపుకునే పండగ వినాయక చవితి. ఈ పండగకు ప్రతీ వీధిలోనూ మంటపాలు ఏర్పాటు చేసి భారీగా ఉత్సవాలు చేస్తారు.,
ఎవరి వీలుని బట్టి వారు 3 రాత్రులు, 5 రాత్రులు, 7 రాత్రులు, 9 రాత్రులు ఉంచి, భక్తి శ్రద్ధలతో వరసిద్ధివినాయకునికి పూజలు చేసి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించి, 10వ రోజైన భాద్రపద శుద్ధ చతుర్దశి (అనంతపద్మనాభ చతుర్దశి) లోపు ఆయా ప్రతిమలను నిమజ్జనం పేరుతో ఎంతో వైభవంగా స్వామీ ప్రతిమలను గంగమ్మ ఒడిని చేరుస్తారు. అంటే, ఆయా ప్రతిమలను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం అంటే పర్యావరణ అనుకూల వీడ్కోలు. వినాయక నిమజ్జనం, మనం చేసుకున్న గణేశ ఉత్సవాలకు ముగింపును సూచిస్తుంది,
show more