Published On Oct 18, 2024
రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో
నల్లమిల్లి రామకోటేశ్వరరావు ట్రస్ట్ దంతవైద్య శిబిరాన్ని సోము వీర్రాజు
ప్రారంభించారు
నల్లమిల్లి రామకోటేశ్వరరావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెనోరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పుష్కరఘాట్ వద్ద దంత వైద్యశిబిరం నిర్వహించారు. రామకోటేశ్వరరావు కుమారుడు నల్లమిల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని బిజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవిలు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్ ఆధ్వర్యంలో వారి టీమ్ వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో డా.ప్రత్యూష కృష్ణ,
శ్రీదేవి చౌక్ వర్తకుల సంఘం ఉపాధ్యక్షులు కొమ్మన శ్రీనివాస్,శ్రీదేవి ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి జి సత్యనారాయణ,ఇమ్మని వెంకటేష్, బుద్దగిరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.